సంగారెడ్డి, జూలై 4
సదాశివపేటపట్టణంలోని12వవార్డునుఅన్నిరంగాల్లోఆదర్శవంతంగాతీర్చిదిద్దేందుకుకౌన్సిలర్ కౌన్సిలర్ పులిమామిడిమమత,కాంగ్రెస్రాష్ట్రనాయకుడుపులిమామిడిరాజుప్రత్యేకప్రణాళికలురూపొందిస్తున్నారు.వార్డుఅభివృద్ధిపనులనువేగవంతంచేస్తామనితెలిపారు.
సదాశివపేట పట్టణంలోని 12వ వార్డును అన్ని రంగాల్లో ఆదర్శవంతమైన వార్డుగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు కౌన్సిలర్ పులిమామిడి మమత, కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు పులిమామిడి రాజు తెలిపారు. వార్డులో అభివృద్ధి పనులను వేగవంతం చేసేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు.
తాగునీటి సరఫరా, అంతర్గత సీసీ రోడ్లు, యూడీసీ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ, వీధి విద్యుత్ దీపాలు, ఐమాక్స్ లైట్లు, పారిశుద్ధ్య నిర్వహణ, పచ్చదనం పెంపు వంటి మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేసినట్లు వెల్లడించారు. ప్రజలకు అవసరమైన ప్రతి సమస్యను గుర్తించి దశల వారీగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి అర్హులైన లబ్ధిదారునికి చేరేలా నిరంతరం కృషి చేస్తామని అన్నారు. ప్రజల సహకారంతో 12వ వార్డును ఆదర్శ వార్డుగా తీర్చిదిద్దడమే తమ ప్రధాన లక్ష్యమని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ వర్క్ ఇన్స్పెక్టర్ వైద్యం ప్రసాద్, గణేష్, 12వ వార్డు ప్రజలు జబ్బార్, ఫహీం, చోటు, రాము, అనిల్, గుణాకర్, పాశ పటేల్, రామ స్వామి, రాఘవేందర్, పోల గణేష్, సోమ శంకర్, గోనె క్రిష్ణ, చింతకింది హన్మంతు తదితరులు పాల్గొన్నారు.












