(ఐజేయూ) (ప్రశ్న ఆయుధం) జూలై 01
రాష్ట్ర, జిల్లా స్థాయిలలో పని చేస్తున్న జర్నలిస్టులకు 2026-2028 సంవత్సరాలకు సంబంధించిన అక్రిడిటేషన్ కార్డుల జారీ ప్రక్రియ ఇంకా కొనసాగుతున్నదని టీయూడబ్ల్యూజే (ఐజేయూ) సంగారెడ్డి జిల్లా శాఖ అధ్యక్షుడు బండారు యాదగిరి తెలిపారు. అర్హులైన వారికి కార్డుల జారీ ప్రక్రియ వివిధ దశలో ఉన్నదని ఆయన అన్నారు.
రాష్ట్ర, జిల్లా స్థాయిలలో పని చేస్తున్న జర్నలిస్టులకు 2026-2028 సంవత్సరాలకు సంబంధించిన అక్రిడిటేషన్ కార్డుల జారీ ప్రక్రియ ఇంకా కొనసాగుతున్నదని టీయూడబ్ల్యూజే (ఐజేయూ) సంగారెడ్డి జిల్లా శాఖ అధ్యక్షుడు బండారు యాదగిరి తెలిపారు. అర్హులైన వారికి కార్డుల జారీ ప్రక్రియ వివిధ దశలో ఉన్నదని ఆయన అన్నారు.
అందువల్ల అక్రిడిటేషన్ కార్డులపై చెల్లుబాటు వ్యవధిని నిర్దేశించకుండా, పాత రాష్ట్ర, జిల్లా పాత్రికేయుల బస్ పాస్లన్నింటి చెల్లుబాటు వ్యవధిని 01.07.2026 నుండి 22.07.2026 వరకు (22) రోజులు పొడిగించారని పేర్కొన్నారు. ఈ మేరకు జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారితో పాటు ఆర్టీసీ అధికారులకు ఉత్తర్వులు జారీ అయ్యాయని అన్నారు.
రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ ఉన్నతాధికారులు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారని యాదగిరి తెలిపారు.












