తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) ఆధ్వర్యంలో కామారెడ్డిలో మంగళవారం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
అంబేద్కర్ జయంతి సందర్భంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో, నాయకులు బాబాసాహెబ్ ఆశయాలు సమాజంలో సమానత్వం, సామాజిక న్యాయం స్థాపనకు కీలకమని అభివర్ణించారు. ఆయన చూపిన మార్గంలోనే దేశాభివృద్ధి సాధ్యమని తెలిపారు.
సమాజంలో ముందుకు సాగడానికి అంబేద్కర్ ఆశయాలను ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఆచరించాలని, వాటిని ముందుకు తీసుకువెళ్లాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందని నాయకులు స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో టీడబ్ల్యూజేఎఫ్ నాయకులు డాకూరి మోహన్, తెడ్డు సాయిలు, పట్నం నర్సింలు, హరీష్ (చిన్న), సుంకరి సంజీవులు, శ్రీకాంత్, సాయిబాబా, రాజు, సాయిరాం పలువురు పాల్గొన్నారు.












