
రాజ్యసభ మాజీ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మీడియా చైర్మన్ డాక్టర్ నర్రెడ్డి తులసి రెడ్డి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 'ఎక్కువ మంది పిల్లల్ని కనండి' అనే పిలుపును, అందుకు ప్రోత్సాహకాలు ప్రకటించడాన్ని తీవ్రంగా ఖండించారు. ఈ విధానం తిరోగమన ఆలోచన అని, దీనిపై ముఖ్యమంత్రి పునరాలోచించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.



















