నర్సాపూర్ మున్సిపాలిటీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నుంచి గెలుపొందిన కౌన్సిలర్లు ఎంపీ రఘునందన్ రావును హైదరాబాద్లోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పట్టణ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై చర్చించారు.
బుధవారం జరిగిన ఈ సమావేశంలో 13వ వార్డు కౌన్సిలర్ బుచ్చేష్ యాదవ్, 8వ వార్డు కౌన్సిలర్ శ్రీకాంత్, 11వ వార్డు కౌన్సిలర్ నిరంజన్ దాస్ పాల్గొన్నారు. ఎంపీ రఘునందన్ రావు నూతన కౌన్సిలర్లను అభినందించి, వారి బాధ్యతల నిర్వహణలో మార్గనిర్దేశం చేశారు.
పట్టణ అభివృద్ధికి, ప్రజల సమస్యల పరిష్కారానికి అంకితభావంతో పనిచేయాలని ఎంపీ కౌన్సిలర్లకు సూచించారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ పారదర్శక పాలన అందించాలని ఆయన ఆకాంక్షించారు.
కౌన్సిలర్లు కూడా తమ వార్డుల అభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి కృషి చేస్తామని ఎంపీకి హామీ ఇచ్చారు. ఈ భేటీ స్థానిక రాజకీయాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది.


