
తెలంగాణ ప్రభుత్వ సలహాదారు మొహమ్మద్ అలీ షబ్బీర్, శనివారం బెంగళూరులో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా దేశ, రాష్ట్ర రాజకీయ పరిణామాలు, కాంగ్రెస్ పార్టీ బలోపేతం, మరియు తెలంగాణలో ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై చర్చ జరిగినట్లు సమాచారం.



















