తెలంగాణ విభజనపై బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి స్పందించారు. చట్టసభల్లో సభ్యులు చేసిన వ్యాఖ్యలపై చర్యలు తీసుకునే అధికారం పోలీసులకు లేదని ఆయన స్పష్టం చేశారు. మంత్రి పొన్నం ప్రభాకర్ లేఖ నేపథ్యంలో ఈ స్పందన వెలువడింది.
తెలంగాణ విభజనపై బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య చేసిన వ్యాఖ్యలను మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్రంగా ఖండించారు. ఎంపీ చర్యలు తీసుకోవాలని కోరుతూ మంత్రి డీజీపీకి లేఖ రాయడంతో ఈ అంశంపై చర్చనీయాంశమైంది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్బాక్స్కి పొందండి
తన లేఖలో, మంత్రి పొన్నం ప్రభాకర్, తేజస్వి సూర్య తెలంగాణ ఆత్మగౌరవాన్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. తెలంగాణ ఏర్పాటును భారత్-పాకిస్తాన్ విభజనతో పోల్చడం సరికాదని ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఎంపీపై చర్యలు తీసుకోవాలని డీజీపీని కోరారు.









