తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత, మాజీ మంత్రి కేటీఆర్ పాదయాత్రపై పలు ప్రశ్నలు లేవనెత్తారు. అధికారంలో పదేళ్లు ఉన్నప్పుడు ప్రజల్లోకి ఎందుకు వెళ్లలేదని, ఇప్పుడు ఎందుకు పాదయాత్ర చేయాలని అనుకుంటున్నారని ఆమె ప్రశ్నించారు. శుక్రవారం హైదరాబాద్లోని జాగృతి కార్యాలయంలో పలువురు నాయకులతో సమావేశమైన కవిత, తన రాజకీయ లక్ష్యాలు, ప్రజా సమస్యలపై పోరాటాల గురించి వివరించారు.
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత, మాజీ మంత్రి కేటీఆర్ పాదయాత్రపై పలు ప్రశ్నలు లేవనెత్తారు. అధికారంలో పదేళ్లు ఉన్నప్పుడు ప్రజల్లోకి ఎందుకు వెళ్లలేదని, ఇప్పుడు ఎందుకు పాదయాత్ర చేయాలని అనుకుంటున్నారని ఆమె ప్రశ్నించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్బాక్స్కి పొందండి
శుక్రవారం హైదరాబాద్లోని జాగృతి కార్యాలయంలో సీపీయూఎస్ఐ కేంద్ర కమిటీ కార్యదర్శి కోదండం, రాష్ట్ర కార్యదర్శి వెంకన్న, దళిత బహుజన రాజ్యాధికార కన్వీనర్ గుడిపల్లి రవన్న, మారోజు వీరన్న సహచరులు కిషన్ నాయక్ సహా పలువురు నాయకులు కవితను కలిశారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ, తెలంగాణలో అన్ని వర్గాలకు అధికారం రావాలన్నదే తన ధ్యేయమని తెలిపారు. అందరికీ అధికారమని మాట్లాడేవారు దానిని ఆచరణలో పెట్టాలని, తాను ఆచరణలోకి తీసుకురావడానికి ప్రయత్నించినప్పుడే తనకు కష్టాలు వచ్చాయని పేర్కొన్నారు.










