జనాభా లెక్కల్లో కురుమలకు అన్యాయం జరుగుతోందని, ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ప్రతి గ్రామపంచాయతీలో జనాభా లెక్కలకు సంబంధించిన పత్రాలను అందుబాటులో ఉంచాలని కురుమ రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు బింగి స్వామి డిమాండ్ చేశారు. కురుమల జనాభాను తక్కువగా చూపిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇకపై విశ్వసించలేమని ఆయన తీవ్రంగా విమర్శించారు.
కురుమ రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు బింగి స్వామి సిద్దిపేట జిల్లా గజ్వేల్ లోని తన నివాసంలో విలేకరులతో మాట్లాడుతూ, జనాభా లెక్కల్లో కురుమలకు అన్యాయం జరుగుతోందని ఆరోపించారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ప్రతి గ్రామపంచాయతీలో జనాభా లెక్కలకు సంబంధించిన పత్రాలను అందుబాటులో ఉంచాలని, ఆన్లైన్లో కూడా ప్రజలకు అందుబాటులో పెట్టాలని డిమాండ్ చేశారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్బాక్స్కి పొందండి
ప్రభుత్వం కురుమల జనాభాను కేవలం 7 లక్షల 95 వేలుగా చూపించడం కురుమ సమాజంపై ఉన్న వ్యతిరేకతకు నిదర్శనమని ఆయన అన్నారు. అసలు జనాభా చాలా ఎక్కువగా ఉన్నప్పటికీ, ఉద్దేశపూర్వకంగా తగ్గించి చూపించడం ద్వారా వారి హక్కులను దెబ్బతీసే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. వివిధ కులాల జనాభాలను కూడా ఎక్కువ-తక్కువగా చూపించినట్లు అనుమానాలున్నాయని పేర్కొన్నారు.










