జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, పాల్వంచలో రోడ్డు భద్రత మరియు మాదకద్రవ్యాల నివారణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. రవాణా శాఖ అధికారులు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
జిల్లా రవాణా అధికారి జె. శ్రీనివాస్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం జరిగింది. పాఠశాల ప్రిన్సిపల్ అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో సహాయక మోటార్ వెహికల్స్ ఇన్స్పెక్టర్ (ఏఎంవీఐ) కె. ఉదయ్ కుమార్ విద్యార్థులకు పలు సూచనలు చేశారు.
ఏఎంవీఐ కె. ఉదయ్ కుమార్ మాట్లాడుతూ, రోడ్డు భద్రతా నియమాలను తప్పనిసరిగా పాటించాలని, నిర్లక్ష్యం వల్ల జరిగే ప్రమాదాలను నివారించడానికి ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన అవసరమని తెలిపారు.
యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండటం ద్వారా ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణంలో తోడ్పడాలని ఆయన విద్యార్థులను కోరారు. మంచి అలవాట్లతో భవిష్యత్తును నిర్మించుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.


