రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం కేశన్నపల్లిలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని, గ్రామ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న మహిళా సంఘాల సభ్యులను సర్పంచ్ పోతరాజు చంటి ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు.
గ్రామ పంచాయతీ కార్యాలయంలో నిర్వహించిన గ్రామసభలో, సర్పంచ్ పోతరాజు చంటి మాట్లాడుతూ కుటుంబ బాధ్యతలతో పాటు సమాజ సేవలోనూ మహిళలు ముఖ్య భూమిక పోషిస్తున్నారని కొనియాడారు. మహిళల కృషి వల్లే గ్రామాభివృద్ధి సాధ్యమవుతుందని, మహిళా సాధికారతతో గ్రామాలు మరింత అభివృద్ధి చెందుతాయని తెలిపారు.
గ్రామ అభివృద్ధిలో మహిళల భాగస్వామ్యం ఎంతో కీలకమని, వారి సేవలను గుర్తించి గౌరవించుకోవాల్సిన అవసరం ఉందని సర్పంచ్ పేర్కొన్నారు. మహిళల అభ్యున్నతికి, సాధికారతకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, అందుకు అనుగుణంగా అనేక పథకాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు.
మహిళల కృషి, త్యాగాలను స్మరించుకుంటూ, వారిలో స్ఫూర్తిని నింపేలా ఈ సన్మాన కార్యక్రమం నిర్వహించారు. మహిళా సంఘాల సభ్యులు తమ అభిప్రాయాలను, సూచనలను గ్రామసభలో తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ వజ్జపల్లి శ్రీకాంత్, వార్డు సభ్యులు, పంచాయతీ కార్యదర్శి, సీఏ, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు. అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

