కరీంనగర్ జిల్లాలో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. గత నాలుగు రోజుల క్రితం భార్య ఆత్మహత్య చేసుకున్న ఘటనను తట్టుకోలేక, అదే రోజు కానిస్టేబుల్ కూడా ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
కరీంనగర్ టూ టౌన్ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న ఎస్సై చంద్రశేఖర్, తన అత్తగారి ఇంట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఆయన భార్య దివ్య నాలుగు రోజుల క్రితం ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. ఈ ఘటనతో తీవ్ర మనస్తాపానికి గురైన చంద్రశేఖర్, ఈ దారుణ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
దివ్య మృతిపై ఇప్పటికే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని, ఈ నేపథ్యంలో చంద్రశేఖర్ ఆత్మహత్య చేసుకోవడం కేసును మరింత క్లిష్టతరం చేసిందని అధికారులు భావిస్తున్నారు. ఈ ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, ఎస్సై చంద్రశేఖర్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని జమ్మికుంట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తును ముమ్మరం చేశారు.
భార్య మరణంతో భర్త కూడా ఆత్మహత్య చేసుకోవడం కుటుంబ సభ్యులను, స్నేహితులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు పోలీసుల దర్యాప్తు అనంతరం వెల్లడయ్యే అవకాశం ఉంది.











