సంగారెడ్డి, జూలై 25
ఆధార్ కార్డు, జనన ధ్రువీకరణ పత్రం లేని నిరుపేద, అనాథ, వలస కార్మికుల పిల్లలు విద్యకు దూరం కాకుండా చూడాలని దూరం మండలవిద్యాధికారిడి.అంజయ్య కాకూడదు: విశ్రాంతమండల కోరారు. సంగారెడ్డి జిల్లా కేంద్రంలో ఇలాంటి పిల్లలు విద్యనందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు.
ఆధార్ కార్డు, జనన ధ్రువీకరణ పత్రం లేకపోవడం వల్ల నిరుపేదలు, అనాథలు, వలస కార్మికుల పిల్లలు విద్యకు దూరమవుతున్నారని విశ్రాంత మండల విద్యాధికారి డి.అంజయ్య ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని పోతిరెడ్డిపల్లి చౌరస్తా సమీపంలో నివసిస్తున్న 13 ఏళ్ల రాముకు తండ్రి లేకపోవడంతో, తల్లి కమ్మరి పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తోందన్నారు. ఐదేళ్ల వయసులో జనన ధ్రువీకరణ పత్రం, ఆధార్ కార్డు లేక పాఠశాలలో చేర్పించకపోవడంతో, విద్యాహక్కు చట్టం–2009 ప్రకారం ఎలాంటి ధ్రువపత్రాలు లేకున్నా ప్రభుత్వ పాఠశాలలో ప్రవేశం కల్పించామని తెలిపారు. అనంతరం రాముకు జనన ధ్రువీకరణ పత్రం, ఆధార్ కార్డు కూడా ఇప్పించామని చెప్పారు.
అలాగే సంగారెడ్డి మండలం కులబ్గూర్ గ్రామానికి చెందిన అఖిల, పావనిలకు కూడా ఇప్పటికీ ఈ ధ్రువపత్రాలు లేవని, వారికి కూడా త్వరలోనే వాటిని అందించి విద్యాభ్యాసానికి ఆటంకం లేకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రభుత్వం, అధికారులు ఇలాంటి పిల్లలను గుర్తించి చదువుకు దూరం కాకుండా చూడాలని అంజయ్య కోరారు.










