Yadadri Bhuvanagiri/Alair (ప్రశ్న ఆయుధం) జూలై 18
భారతీయ సాంకేతిక విద్యా సంస్థ ( ఘనంగా ఐఐటీ) హైదరాబాద్లో 15వ స్నాతకోత్సవం శనివారం ఘనంగా జరిగింది. ఈ ఏడాది అత్యధికంగా 1,398 మంది విద్యార్థులు విద్యార్థులకు పట్టాలు అందుకున్నారు. ఈ కార్యక్రమంలో పద్మవిభూషణ్ డాక్టర్ పద్మ సుబ్రహ్మణ్యం ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
భారతీయ సాంకేతిక విద్యా సంస్థ (ఐఐటీ) హైదరాబాద్ 15వ స్నాతకోత్సవం శనివారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా 1,398 మంది విద్యార్థులు పట్టభద్రులుగా నిలిచి డిగ్రీలు అందుకున్నారు. సంస్థ చరిత్రలోనే ఇది అత్యధిక సంఖ్య.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పద్మవిభూషణ్ డాక్టర్ పద్మ సుబ్రహ్మణ్యం హాజరయ్యారు. శాస్త్రీయ విజ్ఞానాన్ని భారతీయ శాశ్వత జ్ఞానంతో మేళవించి సమాజానికి సేవ చేయాలని ఆమె పట్టభద్రులకు పిలుపునిచ్చారు.
ఐఐటీ హైదరాబాద్ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ చైర్మన్ డాక్టర్ బి.వి.ఆర్. మోహన్ రెడ్డి పట్టాలను ప్రదానం చేయగా, డైరెక్టర్ ప్రొఫెసర్ బి.ఎస్. మూర్తి వార్షిక నివేదికను సమర్పించారు.
ఈ ఏడాది 489 మంది బి.టెక్, 527 మంది ఎం.టెక్, 192 మంది పీహెచ్డీ, 111 మంది ఎంఎస్సీతో పాటు ఇతర కోర్సులకు చెందిన విద్యార్థులు పట్టాలు అందుకున్నారు. విద్యా ప్రతిభకు గుర్తింపుగా 5 స్వర్ణ పతకాలు, 44 రజత పతకాలు ప్రదానం చేశారు.
కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ విభాగానికి చెందిన బొంతు మణి హేమంత్ రెడ్డి భారత రాష్ట్రపతి స్వర్ణ పతకాన్ని అందుకున్నారు. ఇతర విభాగాల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ఇన్స్టిట్యూట్ స్వర్ణ పతకాలు అందజేశారు.
ఈ స్నాతకోత్సవంలో ఐసీ డిజైన్ అండ్ టెక్నాలజీ బి.టెక్ తొలి బ్యాచ్, అలాగే ఐఐటీ హైదరాబాద్–డీకిన్ విశ్వవిద్యాలయం సంయుక్త డాక్టరల్ కార్యక్రమం తొలి బ్యాచ్ విద్యార్థులు పట్టాలు అందుకోవడం విశేషం. క్రిటికల్ మినరల్స్, డిఫెన్స్ టెక్నాలజీ, ఫోటోనిక్స్, సెమీకండక్టర్లు, కృత్రిమ మేధస్సు (AI) వంటి అభివృద్ధి చెందుతున్న రంగాల్లో కొత్త విద్యా కార్యక్రమాలను ప్రారంభిస్తున్నట్లు సంస్థ ప్రకటించింది.
ఈ సందర్భంగా ఐఐటీ హైదరాబాద్ తన అధికారిక సంస్కృత నినాదం "నవోన్మేషేణ దేశ నిర్మాణమ్" (నవోన్నత ఆవిష్కరణల ద్వారా దేశ నిర్మాణం)ను ఆవిష్కరించింది. ప్రపంచ స్థాయి పరిశోధనలు, ఆవిష్కరణలు, స్టార్టప్లు, అంతర్జాతీయ భాగస్వామ్యాలతో దేశాభివృద్ధికి తోడ్పడే భవిష్యత్ నాయకులను తీర్చిదిద్దే లక్ష్యంతో ఐఐటీ హైదరాబాద్ ముందుకు సాగుతోందని సంస్థ ప్రతినిధులు తెలిపారు.












