
నిజామాబాద్ జిల్లా కాలూరులోని శ్రీ సిద్ధి రామేశ్వర అగ్రో ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్లో ప్రభుత్వానికి చెందిన సుమారు రూ.66.12 కోట్ల విలువైన ధాన్యం గల్లంతైనట్లు విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు గుర్తించారు. రబీ 2022–23 నుంచి 2025–26 వరకు కొనుగోలు చేసిన ధాన్యం నిల్వల్లో 2.03 లక్షల క్వింటాళ్ల కొరతను అధికారులు కనుగొన్నారు. ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.



















