
తెలంగాణ దివ్యాంగుల సహకార సంస్థ ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లాలో విద్యార్థులు, దివ్యాంగుల కోసం సహాయ ఉపకరణాల పంపిణీ కార్యక్రమం మంగళవారం కలెక్టర్ కార్యాలయ ఆవరణలో జరిగింది. రాష్ట్ర మంత్రి సీతక్క పాల్గొని అర్హులైన వారికి ద్విచక్ర వాహనాలు, బ్యాటరీ ట్రైసైకిళ్లు, ఇతర సహాయక ఉపకరణాలను అందజేశారు.



















