
కామారెడ్డి జిల్లా కేంద్రంలో రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తికి 'ఓ నెగిటివ్' రక్తం అవసరమవగా, స్థానిక యువకుడు ప్రశాంత్ గౌడ్ 11వ సారి రక్తదానం చేసి ప్రాణాలు కాపాడారు. ఈ సందర్భంగా రక్తదానం ప్రాముఖ్యతను రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు వివరించారు.



















