
కరీంనగర్ నగరంలో నివాసముంటున్న పేద, మధ్యతరగతి కుటుంబాలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని, కేంద్ర మంత్రి బండి సంజయ్ సూచనల మేరకు మున్సిపల్ కార్పొరేషన్ నాలుగు చోట్ల కర్మకాండ నిలయాలను నిర్మించాలని నిర్ణయించింది. ఈ నిలయాలు అంత్యక్రియల అనంతరం ఆశ్రయం కల్పించడంతో పాటు, కనీస వసతులను అందించనున్నాయి.



















