
బీఆర్ఎస్ పాలనలో కల్వకుంట్ల కుటుంబానికే ఉద్యోగాలు దక్కాయని, నిరుద్యోగులను మోసం చేసిన కేటీఆర్కు ఉద్యోగాల అంశంపై మాట్లాడే నైతిక హక్కు లేదని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్కుమార్ గౌడ్ తీవ్రంగా విమర్శించారు. ఉద్యోగాల పేరుతో కేటీఆర్ చేస్తున్న వ్యాఖ్యలు ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నమేనని ఆయన అన్నారు.



















