
తెలంగాణ బయోఫార్మా రంగంలో మరో కీలక ముందడుగు పడింది. సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం బోర్పట్ల శివారులో అత్యాధునిక తెరానిమ్ బయోలాజిక్స్ (TheraNym Biologics) తయారీ యూనిట్ను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ బుధవారం ప్రారంభించారు. ఈ యూనిట్ రాష్ట్ర పారిశ్రామిక ప్రగతికి నూతన ఊతాన్ని అందిస్తుందని మంత్రులు పేర్కొన్నారు.



















