
రాష్ట్రవ్యాప్తంగా జూన్ 3 నుంచి 12 వరకు జరగనున్న గ్రామసభలను సమర్థవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఆదేశించారు. మంగళవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఈ మేరకు ఆయన సూచనలు చేశారు.



















