
కామారెడ్డి జిల్లా, సదాశివనగర్ మండలంలోని భూంపల్లి గ్రామంలో గ్రామదేవతలైన నల్లపోచమ్మ, పోలేరమ్మ, నాయకమ్మ, ముత్యాలమ్మ, బంగారు మైసమ్మ, ఐదు చేతుల పోచమ్మ, పిల్లి పోచమ్మలకు బోనాల పండుగను భక్తిశ్రద్ధలతో, వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు సంప్రదాయబద్ధంగా అమ్మవార్లకు బోనాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు.


















