
మాదకద్రవ్యాలకు దూరంగా ఉండి విద్య, నైపుణ్యాభివృద్ధిపై దృష్టి సారించాలని ఈగల్ ఫోర్స్ డీఎస్పీ ఎం. సోమనాథం విద్యార్థులకు సూచించారు. కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిజామాబాద్లోని గిర్రాజ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 'నషా ముక్త్ భారత్ అభియాన్' సందర్భంగా మాదకద్రవ్యాల దుష్ప్రభావాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.


















