
ఆన్లైన్లో మందుల అమ్మకాలను వ్యతిరేకిస్తూ, దేశవ్యాప్తంగా ఉన్న 12.40 లక్షలకు పైగా మెడికల్ షాపులు ఈ నెల 20వ తేదీన మూసివేయాలని ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్స్ అండ్ డ్రగ్గిస్ట్స్ (AIOCD) పిలుపునిచ్చింది. ఆన్లైన్ ఫార్మసీల వల్ల ప్రజారోగ్యానికి ముప్పు వాటిల్లుతోందని, నకిలీ మందులు సరఫరా అవుతున్నాయని సంస్థ ఆరోపించింది.



















