
కాళేశ్వరం ప్రాజెక్టు, మంజీరా లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ (ఎల్ఐఎస్) భూసేకరణ పనులను వేగవంతం చేసి, నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అధికారులకు స్పష్టం చేశారు. ప్రాజెక్టుల అమలు పురోగతిపై ఆయన శుక్రవారం కలెక్టరేట్లో సమీక్ష నిర్వహించారు. సాగునీటి ప్రాజెక్టుల భూసేకరణలో జాప్యం సహించబోమని ఆయన పేర్కొన్నారు.



















