
మాదకద్రవ్యాల వ్యసనం యువత భవిష్యత్తును అంధకారంలోకి నెట్టేస్తుందని, విద్యార్థులు, యువత డ్రగ్స్ వంటి చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని పలువురు ప్రముఖులు పిలుపునిచ్చారు. అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా హైదరాబాద్లోని శిల్పకళావేదికలో ఈగల్ ఫోర్స్ తెలంగాణ వింగ్ ఆధ్వర్యంలో విస్తృత అవగాహన కార్యక్రమం నిర్వహించారు. తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.



















