
సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం గుండ్లమాచునూర్ గ్రామంలో ఆదివారం పల్స్ పోలియో కార్యక్రమం ప్రారంభమైంది. సర్పంచ్ శ్రీహరి చిన్నారులకు పోలియో చుక్కలు వేసి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఐదేళ్ల లోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు తప్పనిసరి అని ఆయన సూచించారు.



















