
తెలంగాణ రాష్ట్ర బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ నూతన చైర్మన్గా బసవరాజ శ్రీనివాస్, వైస్ చైర్మన్గా పొన్నాడ సుబ్రమణ్య ప్రసాద్ సోమవారం హైదరాబాద్లోని వసంత్ విహార్ ఫంక్షన్ హాల్లో తమ పదవీ బాధ్యతలను స్వీకరించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.



















