
సమాజంలో చదువుపై ఆసక్తిని, యువతలో చైతన్యాన్ని పెంపొందించడంలో మంచి పుస్తకాల ప్రాధాన్యతను గెజిటెడ్ అధికారుల సంఘం జిల్లా అధ్యక్షుడు, టీజేఏసీ సెక్రటరీ జనరల్ వైద్యనాథ్ నొక్కి చెప్పారు. శుక్రవారం సంగారెడ్డి జిల్లా గ్రంథాలయంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంజయ్యకు పలు విలువైన పుస్తకాలను ఆయన అందజేశారు.



















