యాడారం గ్రామానికి చెందిన గన్నమనేని నరసింగరావు తన వంశపారంపర్య స్థలాన్ని కొందరు ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
గ్రామానికి చెందిన గన్నమనేని అశోక్రావు, చిట్టెమ్మ, కిషన్రావు కలిసి స్థలంలోని కడిలను తొలగించి ఆక్రమణకు పాల్పడుతున్నారని నరసింగరావు తెలిపారు.
ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకునేందుకు తన స్థలంలో పనులు ప్రారంభించిన సమయంలో ఈ వివాదం తలెత్తిందని ఆయన పేర్కొన్నారు.
ఈ విషయమై సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయగా, గ్రామ పెద్దల సమక్షంలో కూర్చొని సమస్యను పరిష్కరించుకోవాలని అధికారులు సూచించినట్లు తెలిపారు.
ప్రత్యర్థి వర్గం చర్చలకు ముందుకు రావడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.










