సంగారెడ్డి, జూలై 17
సంగారెడ్డి పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఆపిల్ ఫార్మసీని డీసీసీ అధ్యక్షురాలు నిర్మలా జగ్గారెడ్డి ప్రారంభించారు. విద్యుత్ కార్యాలయం ఎదురుగా ప్రారంభమైన ఈ ఫార్మసీ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
సంగారెడ్డి పట్టణంలోని విద్యుత్ కార్యాలయం ఎదురుగా నూతనంగా ఏర్పాటు చేసిన ఆపిల్ ఫార్మసీని డీసీసీ అధ్యక్షురాలు నిర్మలా జగ్గారెడ్డి ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో సంగారెడ్డి మున్సిపల్ చైర్ పర్సన్ కూన వనితా సంతోష్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి తోపాజీ అనంత్ కిషన్, నాయకులు కూన సంతోష్, మెడికల్ అససియేషన్ అధ్యక్షుడు సంతోష్ తదితరులు పాల్గొన్నారు.












