జిల్లాలో రబి-యాసంగి సీజన్ ధాన్యం కొనుగోలు ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ (రెవెన్యూ) మాధురి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు శుక్రవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో, 2025-26 రబీ సీజన్లో జిల్లాలో సుమారు 2.20 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మార్కెట్కు వస్తుందని అంచనా వేసినట్లు అదనపు కలెక్టర్ తెలిపారు. ఇందులో దొడ్డురకం ధాన్యం 2 లక్షల మెట్రిక్ టన్నులు, సన్నరకం ధాన్యం 20 వేల మెట్రిక్ టన్నులు ఉండవచ్చని వివరించారు. రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆమె అధికారులకు సూచించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్బాక్స్కి పొందండి
ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధరల వివరాలను అదనపు కలెక్టర్ తెలియజేశారు. గ్రేడ్-ఏ రకం ధాన్యానికి క్వింటాల్కు రూ.2,389, కామన్ రకానికి రూ.2,369 నిర్ణయించినట్లు తెలిపారు. సన్నరకం ధాన్యానికి క్వింటాల్కు రూ.2,389తో పాటు అదనంగా రూ.500 బోనస్తో కలిపి రూ.2,889 అందించనున్నట్లు పేర్కొన్నారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.











