సంగారెడ్డి జిల్లా, హత్నూర మండలం, గుండ్లమాచునూర్ గ్రామంలో బుధవారం ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని గోషామహల్ ఎమ్మెల్యే రాజసింగ్, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజసింగ్ యువతకు ఛత్రపతి శివాజీని ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు.
ఛత్రపతి శివాజీ మహారాజ్ హిందూ ధర్మం కోసం, స్త్రీల రక్షణ కోసం ఎన్నో పోరాటాలు చేశారని, యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండి ధర్మ రక్షణకు ముందుకు సాగాలని ఎమ్మెల్యే రాజసింగ్ సూచించారు.
నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డి మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ శివాజీ మహారాజ్ అడుగుజాడల్లో నడుచుకోవాలని, ఆయన జీవితం యువతకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు, గ్రామస్తులు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. విగ్రహావిష్కరణ కార్యక్రమం విజయవంతంగా జరిగింది.


