పటాన్ చెరు వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం గురువారం రాష్ట్ర మంత్రి దామోదర్ రాజనర్సింహ సమక్షంలో అంగరంగ వైభవంగా జరిగింది. నూతనంగా ఎన్నికైన చైర్మన్, వైస్ చైర్మన్, డైరెక్టర్లు ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం మంత్రి నూతన పాలకవర్గాన్ని సన్మానించారు.
పటాన్ చెరు వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం గురువారం రాష్ట్ర మంత్రి దామోదర్ రాజనర్సింహ ముఖ్య అతిథిగా హాజరుకావడంతో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా కార్యకర్తలు మంత్రికి ఘన స్వాగతం పలికారు.
భారతరత్న డా.బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసిన అనంతరం, వేలాది మంది కార్యకర్తలతో భారీ ర్యాలీగా వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయం వరకు తరలివచ్చారు. ర్యాలీలో బాణాసంచా కాల్చుతూ, గజమాలలతో సత్కరిస్తూ కార్యకర్తలు ఉత్సాహాన్ని ప్రదర్శించారు.
ఈ కార్యక్రమంలో పటాన్ చెరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్గా యేపూరి శివానందం, వైస్ చైర్మన్గా రాజశేఖర్తో పాటు డైరెక్టర్లు తమ పదవీ బాధ్యతలను స్వీకరించారు. ప్రమాణ స్వీకారం అనంతరం నూతన పాలకవర్గాన్ని మంత్రి దామోదర్ రాజనర్సింహ ఘనంగా సన్మానించారు.
మంత్రి తన ప్రసంగంలో పటాన్ చెరు నియోజకవర్గ చరిత్రను, పారిశ్రామిక అభివృద్ధిని గుర్తుచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సంక్షేమం, విద్య, వైద్యంపై దృష్టి సారించిందని, మహిళా సాధికారతతో పాటు అన్ని రంగాల్లో అభివృద్ధికి కృషి చేస్తోందని తెలిపారు. సంగారెడ్డి జిల్లాకు BHEL, BDL, IIT హైదరాబాద్ వంటి సంస్థలను తీసుకువచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు.












