సంగారెడ్డిలోని తెలంగాణ మైనారిటీస్ మైనారిటీ పాఠశాల & జూనియర్ కళాశాల (బాలికల)లో 'ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక' కార్యక్రమంలో భాగంగా తల్లిదండ్రులు-ఉపాధ్యాయుల సమావేశం, మరియు అడ్మిషన్ డ్రైవ్ కార్యక్రమం గురువారం విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం కాశీపూర్లోని కొత్త క్యాంపస్లో జరిగింది.
ఈ సమావేశానికి జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి (DMWO) జి. అంబదాస్ రాజేశ్వర్, ఆర్ఎల్సీ డి.బహుమతి, అడ్మిషన్ కమిటీ సభ్యులు, విజిలెన్స్ అధికారులు ఎం.డి.గౌస్ పాషా, జగదీశ్వర్ రెడ్డి, జిల్లా కోఆర్డినేటర్ వసీముద్దీన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ముఖ్య అతిథులు విద్య, క్రమశిక్షణ, సంక్షేమ పథకాలు, బాలికల విద్య ప్రాముఖ్యతపై ప్రసంగించారు.
తల్లిదండ్రులు కూడా తమ అభిప్రాయాలను, సూచనలను సమావేశంలో పంచుకున్నారు. కళాశాల ప్రిన్సిపాల్ హేమలత విద్యా ఫలితాలు, మౌలిక వసతులు, విద్యార్థుల సంక్షేమ చర్యల గురించి వివరించారు. విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి పాఠశాల యాజమాన్యం కట్టుబడి ఉందని ఆమె తెలిపారు.
అనంతరం, అకాడమిక్ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు మెడల్స్ అందజేసి సత్కరించారు. ఇంటర్మీడియట్ 1వ, 2వ సంవత్సరం (CEC, MEC) టాపర్లతో పాటు SA-2 పరీక్షల్లో ఫస్ట్ ర్యాంక్ సాధించిన విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమం విద్యార్థులలో స్ఫూర్తిని నింపింది.
ఈ సమావేశంలో ప్రిన్సిపాల్ హేమలతతో పాటు కళాశాల, పాఠశాల ఉపాధ్యాయుల బృందం, విద్యార్థులు, మరియు పెద్ద సంఖ్యలో తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఇది పాఠశాల, తల్లిదండ్రుల మధ్య సమన్వయాన్ని మరింత బలోపేతం చేసింది.











