
రాష్ట్ర సచివాలయంలో జరిగిన కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పలు కీలక సంక్షేమ పథకాలు, విద్యా కార్యక్రమాల అమలుపై విస్తృతంగా సమీక్ష నిర్వహించారు. విద్యార్థులకు ఉన్నత విద్య కోసం పావలా వడ్డీకే రుణాలు, మత్స్యకారులకు ఆర్థిక సహాయం, యువతకు విదేశీ భాషా శిక్షణ వంటి అంశాలపై ఆయన ఆదేశాలు జారీ చేశారు.



















