
నర్సంపేట నియోజకవర్గం, ఖానాపూర్ మండలం పరిధిలోని అశోక్ నగర్ గ్రామంలో కాకతీయుల కాలం నాటి పురాతన శివాలయం కూల్చివేతకు నిరసనగా, బీజేపీ వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ గోగుల రాణా ప్రతాప్ రెడ్డి గారు శుక్రవారం 'ధర్మాగ్రహ దీక్ష'ను ప్రారంభించారు. కూల్చివేసిన స్థలంలోనే శివాలయాన్ని తక్షణమే పునర్నిర్మించాలని ఆయన డిమాండ్ చేశారు.



















