
పర్యావరణ పరిరక్షణలో భాగంగా సదాశివపేట మండల విద్యాధికారి ఎన్.శంకర్ పిలుపు మేరకు ఉపాధ్యాయులు ఆదర్శంగా నిలిచారు. సదాశివపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జరుగుతున్న మూడు రోజుల శిక్షణా కార్యక్రమంలో పాల్గొంటున్న ఉపాధ్యాయులు మధ్యాహ్న భోజన సమయంలో ప్లాస్టిక్ పేపర్ ప్లేట్లకు బదులుగా స్టీల్ ప్లేట్లలో భోజనం చేశారు.



















