
నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన జూనియర్ సివిల్ జడ్జి-కమ్-జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ కోర్టును ఆదివారం తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ తంగిరాల మాధవీదేవి ప్రారంభించారు. ఈ కోర్టు ఏర్పాటుతో గ్రామీణ ప్రజలకు సత్వర, సులభ న్యాయసేవలు అందుబాటులోకి వస్తాయని ఆమె తెలిపారు.



















