
జిల్లాలో పీసీపీఎన్డీటీ (PCPNDT) చట్టాన్ని కట్టుదిట్టంగా అమలు చేయాలని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డా. రాజ్యలక్ష్మి అధికారులను ఆదేశించారు. బుధవారం ఆమె అధ్యక్షతన నిర్వహించిన జిల్లా పీసీపీఎన్డీటీ సలహా కమిటీ సమావేశంలో ఈ మేరకు సూచనలు చేశారు.

జిల్లాలో పీసీపీఎన్డీటీ (PCPNDT) చట్టాన్ని కట్టుదిట్టంగా అమలు చేయాలని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డా. రాజ్యలక్ష్మి అధికారులను ఆదేశించారు. బుధవారం ఆమె అధ్యక్షతన నిర్వహించిన జిల్లా పీసీపీఎన్డీటీ సలహా కమిటీ సమావేశంలో ఈ మేరకు సూచనలు చేశారు.

నీట్ పరీక్షలో అవకతవకలకు నిరసనగా జరిగిన బంద్ సందర్భంగా విద్యార్థి నాయకులపై నమోదు చేసిన కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని అఖిలపక్ష నాయకులు, ప్రజాసంఘాల ప్రతినిధులు డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా ప్రశ్నించే గొంతులను అణచివేసే ప్రయత్నాలను ప్రభుత్వం విరమించుకోవాలని వారు కోరారు.

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా జలకళ సంతరించుకుంది. వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో రైతాంగానికి ఊరట లభించింది. ఖరీఫ్ సాగుకు సిద్ధమైన రైతుల్లో సరికొత్త ఉత్సాహం నెలకొంది.

ప్రజలకు సమర్థవంతమైన, స్నేహపూర్వక పోలీసింగ్ అందించడానికి ప్రతి అధికారి బాధ్యతాయుతంగా వ్యవహరించాలని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, ఐపీఎస్ సూచించారు. బుధవారం రూరల్ పోలీస్ స్టేషన్లో వార్షిక తనిఖీలు నిర్వహించిన ఆయన, స్టేషన్ పనితీరు, రికార్డుల నిర్వహణ, కేసుల దర్యాప్తు, ప్రజా సేవల అమలును పరిశీలించారు.

బాల్కొండ పట్టణంలో ప్రైవేట్ పాఠశాలల బస్సులు అతి పెద్ద హారన్లను ఉపయోగించడం వల్ల స్థానికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. భారీ శబ్దాలతో ప్రజలు, ముఖ్యంగా గుండె జబ్బులు ఉన్నవారు ప్రాణాపాయం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై అధికారులు వెంటనే స్పందించాలని కోరుతున్నారు.

ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించిన ధాన్యాన్ని మిల్లింగ్ చేసి సీఎంఆర్ రూపంలో అప్పగించాల్సిన కొందరు రైస్ మిల్లర్లు భారీ అక్రమాలకు పాల్పడినట్లు అధికారులు గుర్తించారు. ప్రభుత్వానికి అందాల్సిన బియ్యాన్ని బహిరంగ మార్కెట్కు తరలించి కోట్ల రూపాయలు ఆర్జించినట్లు వెలుగులోకి రావడంతో, సంబంధిత మిల్లులపై చట్టపరమైన చర్యలు ప్రారంభమయ్యాయి.

గుండ్ల మాచునూర్ గ్రామ సర్పంచ్ శ్రీహరి బుధవారం హైదరాబాద్లో రాష్ట్ర గనులు, భూగర్భ వనరుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గ్రామ అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై మంత్రికి వినతి పత్రం సమర్పించారు.

ఎల్లారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) కార్యక్రమంలో భాగంగా చేపట్టిన ఎన్యూమరేషన్ ఫారమ్ల (ఈఎఫ్ఎస్) ప్రక్రియను 100 శాతం పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు. లక్ష్యాన్ని గడువులోగా విజయవంతంగా పూర్తి చేసిన ఎన్నికల యంత్రాంగాన్ని ఆయన అభినందించారు.

పటాన్ చెరు మండలం నందిగామ గ్రామంలో ఆషాడ మాసం సందర్భంగా ఇంటి కుల దైవం శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి బోనం మరియు కళ్యాణ మహోత్సవం కార్యక్రమాన్ని పటాన్ చెరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఏవూరి శివానందం, కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు.

నిజామాబాద్ జిల్లా కాలూరులోని శ్రీ సిద్ధి రామేశ్వర అగ్రో ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్లో ప్రభుత్వానికి చెందిన సుమారు రూ.66.12 కోట్ల విలువైన ధాన్యం గల్లంతైనట్లు విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు గుర్తించారు. రబీ 2022–23 నుంచి 2025–26 వరకు కొనుగోలు చేసిన ధాన్యం నిల్వల్లో 2.03 లక్షల క్వింటాళ్ల కొరతను అధికారులు కనుగొన్నారు. ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

సదాశివపేట పట్టణంలోని పాతకేరిలో కొలువైన శ్రీ రేణుక ఎల్లమ్మ అమ్మవారి దేవాలయంలో ప్రతి సంవత్సరం ఆషాఢ మాసం తొలి మంగళవారం సందర్భంగా నిర్వహించే బోనాల మహోత్సవాలు ఈ ఏడాది అత్యంత వైభవంగా జరిగాయి. ఈ మహోత్సవానికి ముఖ్య అతిథిగా సంగారెడ్డి ఎమ్మెల్యే కంటెస్టెడ్ అభ్యర్థి పులిమామిడి రాజు హాజరై అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

నిజామాబాద్ నగరంలో టౌన్-5 పోలీసులు రెండు వేర్వేరు చోరీ కేసులను ఛేదించారు. ఈ కేసులకు సంబంధించి ఇద్దరు నిందితులను అరెస్టు చేసి, దొంగిలించిన సొత్తును స్వాధీనం చేసుకున్నారు. వీరి నుంచి శాంసంగ్ మానిటర్, డెల్ సీపీయూ, హెచ్పీ కీబోర్డ్, ఓరియంట్ టేబుల్ ఫ్యాన్ వంటి వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.

నీట్ పరీక్ష ప్రశ్నపత్రం లీకేజీకి నిరసనగా జరిగిన ఆందోళనల్లో విద్యార్థి నాయకులపై నమోదైన కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని సీపీఐ, సీపీఎం, సీపీఐ(ఎంఎల్) మాస్ లైన్, న్యూడెమోక్రసీ పార్టీలు డిమాండ్ చేశాయి. ఈ మేరకు సోమవారం జిల్లా కేంద్రంలో సంయుక్తంగా విలేకరుల సమావేశం నిర్వహించాయి.

జిల్లాలో ప్రసవాల సమయంలో మాతృ, శిశు మరణాలు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ వైద్యాధికారులను ఆదేశించారు. గర్భిణులకు సకాలంలో వైద్య సేవలు అందించి, మరణాలను పూర్తిగా నివారించేలా ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.

జిల్లాలో రోడ్డు ప్రమాదాల నియంత్రణకు అన్ని శాఖలు సమన్వయంతో సమిష్టిగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అధికారులను ఆదేశించారు. ప్రమాదాలకు కారణమయ్యే అంశాలను శాస్త్రీయంగా విశ్లేషించి, బ్లాక్ స్పాట్లలో తక్షణ నివారణ చర్యలు చేపట్టడం ద్వారా జిల్లాను ప్రమాద రహితంగా తీర్చిదిద్దాలని ఆయన పిలుపునిచ్చారు.

క్షయ రహిత భారతం లక్ష్యంగా నిజామాబాద్ నగరంలోని 28వ వార్డులో టీబీఎంబీఏ–2.0 మెగా ఉచిత ఆరోగ్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరాన్ని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి (డీఎంహెచ్ఓ) డా. రాజశ్రీ, జిల్లా క్షయ నియంత్రణ అధికారి (డీటీసీఓ) డా. దేవి నాగేశ్వరి సందర్శించి, ఏర్పాట్లను పరిశీలించారు. నిక్షయ్ మిత్రగా సేవలందిస్తున్న కార్పొరేటర్ మల్కాయి మహేందర్ క్షయవ్యాధి బాధితులకు ఆహార కిట్లను పంపిణీ చేశారు.

నిజామాబాద్ పార్లమెంట్ సభ్యుడు అర్వింద్ ధర్మపురి మంగళవారం న్యూఢిల్లీలో కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ను కలిసి, తన నియోజకవర్గ పరిధిలోని పెండింగ్లో ఉన్న రైల్వే ప్రాజెక్టులకు అనుమతులు త్వరితగతిన మంజూరు చేయాలని, ఆమోదం పొందిన ప్రాజెక్టుల పనులను వేగవంతం చేయాలని వినతిపత్రం సమర్పించారు.

ఎస్సారెస్పీ బ్యాక్వాటర్లో ఇటీవల జరిగిన ప్రమాదంలో మృతి చెందిన షేక్ ఖలీమ్, అజీమ్, నజువత్ కుటుంబాలను నిజామాబాద్ డీసీసీ కార్పొరేషన్ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ పరామర్శించారు. ఈ సందర్భంగా, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ బాధిత కుటుంబ సభ్యులతో ఫోన్ లో మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు.

ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని, లేదంటే జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ పటేల్ కులాచారి హెచ్చరించారు. ఈ డిమాండ్తో ఇందూరు బీజేవైఎం ఆధ్వర్యంలో విద్యార్థుల సంతకాల సేకరణ, మిస్కాల్ ఉద్యమాన్ని ప్రారంభించారు.

నిజామాబాద్ రైల్వే స్టేషన్లో అపస్మారక స్థితిలో లభించిన ఓ గుర్తుతెలియని మహిళ చికిత్స పొందుతూ మృతి చెందింది. ఆమె కుడి చేతిపై కన్నడ భాషలో 'పద్మ' అనే పేరు పచ్చబొట్టుగా ఉంది.