
జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ శుక్రవారం బీబీపేట్ మండలంలోని మహేశ్వరి రైస్ మిల్ను సందర్శించి, ధాన్యం దిగుబడి తీరును, నాణ్యతను, సీఎంఆర్ బియ్యం తయారీ పురోగతిని పరిశీలించారు. కొనుగోలు కేంద్రాల నుంచి వచ్చిన ధాన్యాన్ని వెంటనే మిల్లింగ్ చేయాలని, అకాల వర్షాల నుంచి ధాన్యాన్ని రక్షించాలని ఆదేశించారు.



















