
మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ (సీతక్క) బుధవారం సంగారెడ్డిలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. సప్లిమెంటరీ న్యూట్రిషన్ ప్రోగ్రామ్ (ఎస్ఎన్పీ) అమలు, అంగన్వాడీ కేంద్రాల విద్యుదీకరణ, గర్భిణులు, బాలింతలు, చిన్నారుల హాజరు, పోషకాహార సరుకుల సరఫరా, బాల్య వివాహాల నివారణ వంటి అంశాలపై ఆమె చర్చించారు.



















