
సమాజంలో సమరసత భావాన్ని పెంపొందించడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అఖిల భారత సామాజిక సమరసత కళా విభాగం కన్వీనర్ శ్రీ అప్పాల ప్రసాద్ పిలుపునిచ్చారు. కామారెడ్డిలో సామాజిక సమరసతా వేదిక ఆధ్వర్యంలో జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆయన ఈ పిలుపునిచ్చారు. కుల, మత, ప్రాంత, వర్గ విభేదాల వల్ల సమాజం బలహీనపడుతుందని, దీనివల్ల దేశ అస్థిరతకు దారితీసే అవకాశముందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.



















