
మానవత్వంతో రక్తదానం చేయాలని, రక్తానికి ప్రత్యామ్నాయ మార్గాలు లేవని రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త, ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ బాలు పిలుపునిచ్చారు. తలసేమియా వ్యాధిగ్రస్తులైన చిన్నారులను కాపాడుకోవాలని ఆయన అన్నారు. కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండలం రామేశ్వర్ పల్లిలో నిర్వహించిన రక్తదాన శిబిరంలో 40 మంది రక్తదానం చేశారు.



















