
జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, ఐపీఎస్ ప్రజల నుంచి మొత్తం 32 ఫిర్యాదులను స్వీకరించారు. బాధితుల సమస్యలను స్వయంగా విన్న ఆయన, వాటిని చట్టప్రకారం సత్వరమే పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.



















