
గుమ్మడిదల మండలంలోని కొత్తపల్లి గ్రామంలో కొనసాగుతున్న ఎస్ఐఆర్ (Sir) కార్యక్రమాన్ని ఆత్మ కమిటీ చైర్మన్ కొత్తపల్లి శ్రీనివాస్ రెడ్డి శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన ఓటరు జాబితా పారదర్శకంగా రూపొందడంలో ఎస్ఐఆర్ ప్రక్రియ ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. అర్హులైన ఓటర్లు తమ వివరాలను సరిచూసుకుని, అవసరమైన మార్పుల కోసం గడువులోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.



















