
ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి, అర్హులైన వారికి వేగంగా పరిష్కారాలు చూపాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అధికారులను ఆదేశించారు. సోమవారం జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి వచ్చిన వినతులను అదనపు కలెక్టర్లు సంగీత, పాండులతో కలిసి స్వీకరించారు.



















