
ఓటరు జాబితా సవరణ ప్రక్రియ (ఎస్ఐఆర్)ను విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని ఆత్మ కమిటీ చైర్మన్ కొత్తపల్లి శ్రీనివాస్ రెడ్డి పిలుపునిచ్చారు. అర్హులైన ఓటర్లు నిర్దేశిత గడువులోగా ఫారాలను సమర్పించాలని సూచించారు.

ఓటరు జాబితా సవరణ ప్రక్రియ (ఎస్ఐఆర్)ను విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని ఆత్మ కమిటీ చైర్మన్ కొత్తపల్లి శ్రీనివాస్ రెడ్డి పిలుపునిచ్చారు. అర్హులైన ఓటర్లు నిర్దేశిత గడువులోగా ఫారాలను సమర్పించాలని సూచించారు.

సదాశివపేటలోని చాపలకేరి శ్రీ మహంకాళి మందిరంలో జూలై 31 నుంచి ఆగస్టు 3 వరకు జరగనున్న 30వ బ్రహ్మోత్సవాలు, బోనాల జాతరకు సంగారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి పులిమామిడి రాజును ఆలయ కమిటీ సభ్యులు ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆహ్వాన పత్రికను అందజేసి, ఉత్సవాలకు విచ్చేసి అమ్మవారి ఆశీస్సులు పొందాలని కోరారు.

ఎస్ఐఆర్ ప్రక్రియను ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకుని విజయవంతం చేయాలని ఆత్మ కమిటీ చైర్మన్ కొత్తపల్లి శ్రీనివాస్ రెడ్డి పిలుపునిచ్చారు. ఓటరు జాబితా పారదర్శకంగా రూపొందడానికి ఈ ప్రక్రియ కీలకమని ఆయన ఆదివారం పేర్కొన్నారు.

నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండల విద్యాధికారి (ఎఫ్ఏసీ) మరియు జెడ్పీహెచ్ఎస్ బాల్కొండ ప్రధానోపాధ్యాయుడు (గ్రేడ్-2) బి. రాజేశ్వర్ను వరంగల్ ప్రాంతీయ పాఠశాల విద్య సంయుక్త సంచాలకులు (ఎఫ్ఏసీ) పి. మదన్ మోహన్ సస్పెండ్ చేశారు. ఉపాధ్యాయ శిక్షణలో విద్యార్థుల ఉచిత నోట్బుక్ల పంపిణీలో మార్గదర్శకాల ఉల్లంఘన ఆరోపణలపై ఈ చర్యలు తీసుకున్నారు.

వాసవి గ్రేటర్ ఆర్య వైశ్య సంఘం ఆధ్వర్యంలో ఆదివారం నిజామాబాద్లో ఆషాఢ వనభోజనాల కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, అర్బన్ డీసీసీ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ వనభోజనాలు సామాజిక ఐక్యతను బలోపేతం చేస్తాయని బొబ్బిలి రామకృష్ణ అన్నారు.

విద్యార్థి సంఘాల నాయకులపై నమోదు చేసిన అక్రమ, తప్పుడు కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పీడీఎస్యూ) జిల్లా అధ్యక్షుడు ఆర్. గౌతమ్ కుమార్, జిల్లా కార్యదర్శి ప్రిన్స్ డిమాండ్ చేశారు. రియాన్స్ కళాశాల యాజమాన్యం తమతో దురుసుగా ప్రవర్తించిందని, పోలీసులకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదని, విద్యార్థి సంఘాల నాయకులపైనే తప్పుడు కేసులు నమోదు చేశారని వారు ఆరోపించారు.

తానాగుర్దు గ్రామంలో ‘మన ఊరు–మన భద్రత, మన బాధ్యత’ కార్యక్రమంలో భాగంగా పోలీసు శాఖ ఆధ్వర్యంలో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులకు ఇళ్లలో దొంగతనాలు నివారించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలతో పాటు, సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు.

నగరంలో పనిమనుషుల ద్వారా జరుగుతున్న దొంగతనాలు ఆందోళనకరంగా పెరుగుతున్నాయని హైదరాబాద్ పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. ఇంటి పనులకు నియమించుకునే ముందు వ్యక్తుల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించకపోతే విలువైన ఆస్తులను కోల్పోయే ప్రమాదం ఉందని తెలిపారు. ముఖ్యంగా ఐటీ ఉద్యోగులు, ఒంటరిగా నివసించే విద్యార్థులు, వృద్ధులే లక్ష్యంగా నేరాలు జరుగుతున్నాయని వెల్లడించారు.

నిండు గర్భిణిగా ఉన్నప్పటికీ జిల్లా కలెక్టర్ త్రిపాఠి తన అధికారిక బాధ్యతలను సమర్థంగా నిర్వర్తించి అందరి ప్రశంసలు అందుకున్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియ పురోగతిపై ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షలు నిర్వహిస్తూ క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటించారు.

ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు నిజామాబాద్లోని 36, 37 డివిజన్లలో ఆదివారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బొబ్బిలి రామకృష్ణ పాల్గొన్నారు.

నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు పెద్ది సుదర్శన్ రెడ్డి ఆదివారం ఉదయం తీవ్ర గుండెపోటుకు గురయ్యారు. హన్మకొండలోని రోహిణి ఆసుపత్రికి తరలించగా, వైద్యురాలు డాక్టర్ మమత రెడ్డి అత్యవసర చికిత్స అందించి ప్రాణాలు కాపాడారు.

నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు (ఎస్ఆర్ఎస్పీ) బ్యాక్వాటర్ ప్రాంతంలో ఆదివారం ఘోర విషాదం చోటుచేసుకుంది. విహారయాత్రకు వచ్చిన ఐదుగురు యువకుల్లో నలుగురు నీటిలో స్నానానికి దిగి లోతైన గుంతల్లో చిక్కుకుని గల్లంతయ్యారు. వీరిలో ఇద్దరి మృతదేహాలను వెలికితీయగా, మరో ఇద్దరి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన జూనియర్ సివిల్ జడ్జి-కమ్-జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ కోర్టును ఆదివారం తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ తంగిరాల మాధవీదేవి ప్రారంభించారు. ఈ కోర్టు ఏర్పాటుతో గ్రామీణ ప్రజలకు సత్వర, సులభ న్యాయసేవలు అందుబాటులోకి వస్తాయని ఆమె తెలిపారు.

నిజామాబాద్లోని శ్రీ నూతన వైశ్య ఉన్నత పాఠశాలలో 1976–77 విద్యా సంవత్సరంలో పదో తరగతి చదివిన పూర్వ విద్యార్థులు తమ విద్యాభ్యాసం ప్రారంభించి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా స్వర్ణోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ ఆత్మీయ సమ్మేళనంలో పూర్వ విద్యార్థులు కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొని పాత జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు.

ఒకప్పుడు జీవితంలో విడదీయరాని భాగంగా ఉన్న స్నేహబంధాలు నేడు క్రమంగా తగ్గిపోతున్నాయని, ప్రపంచవ్యాప్తంగా ‘స్నేహితుల కొరత’ ఆందోళనకర స్థాయికి చేరిందని పలు అధ్యయనాలు సూచిస్తున్నాయి. నేటి జీవనశైలి, టెక్నాలజీ ప్రభావం, తీరికలేని పనివేళలు, చిన్న కుటుంబాల పెరుగుదల వంటి కారణాలతో నిజమైన స్నేహాలు అరుదవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. గతంలో ఒక వ్యక్తికి అనేక మంది సన్నిహిత స్నేహితులు ఉండేవారు. అయితే కాలక్రమేణా ఆ సంఖ్య గణనీయంగా తగ్గింది.

ఆధార్ కార్డు, జనన ధ్రువీకరణ పత్రం లేని నిరుపేద, అనాథ, వలస కార్మికుల పిల్లలు విద్యకు దూరం కాకుండా చూడాలని దూరం మండలవిద్యాధికారిడి.అంజయ్య కాకూడదు: విశ్రాంతమండల కోరారు. సంగారెడ్డి జిల్లా కేంద్రంలో ఇలాంటి పిల్లలు విద్యనందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు.

కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వ్యవహారంపై సీపీఎం స్పందించింది. ఈ రాజీనామా విద్యార్థుల, యువత విజయమని సీపీఎం సంగారెడ్డి జిల్లా కార్యదర్శి గొల్లపల్లి జయరాజు పేర్కొన్నారు. శనివారం ఆయన విడుదల చేసిన ప్రకటనలో, విద్యార్థులు, యువత చేసిన పోరాటాల వల్లే ఈ మార్పు సాధ్యమైందని తెలిపారు.

టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆధ్వర్యంలో సంగారెడ్డిలో 'రాహుల్ గాంధీ విక్టరీ ర్యాలీ' నిర్వహించారు. రాహుల్ గాంధీ నిరంతర పోరాటమే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు కారణమని జగ్గారెడ్డి అన్నారు. నీట్ పేపర్ లీక్ ఘటనపై రాహుల్ గాంధీ ఉద్యమం ఉధృతమైందని తెలిపారు.

ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలో ప్రజలు ఎదుర్కొంటున్న ఇంటి నంబర్ల అస్పష్టత, సీసీ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడం వంటి పలు మౌలిక సమస్యలను తక్షణమే పరిష్కరించాలని నవభారత్ నిర్మాణ్ యువసేన వ్యవస్థాపక అధ్యక్షుడు మెట్టు శ్రీధర్ మున్సిపల్ కమిషనర్ను కోరారు. మున్సిపాలిటీని పరిశుభ్రమైన, హరిత, ఆధునిక ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దాలని విజ్ఞప్తి చేశారు.

రేగోడ్ మండలంలోని అన్ని అంగన్వాడీ కేంద్రాలకు కాంగ్రెస్ నాయకుడు పోలీస్ కృష్ణ శనివారం ఫ్యాన్లను అందజేశారు. అంగన్వాడీ సిబ్బంది విజ్ఞప్తి మేరకు ఈ సహాయం చేశారు. పిల్లలు, గర్భిణులు, బాలింతలు సౌకర్యవంతంగా ఉండేలా చూడటమే తమ లక్ష్యమని ఆయన తెలిపారు.