
కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం ఎర్రపహాడ్ గ్రామానికి చెందిన ఇరుమ లక్ష్మి, రాజయ్య అనే వృద్ధ దంపతులు నివాసానికి సరైన ఆశ్రయం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్లాస్టిక్ తాటిపత్రి కింద జీవనం గడుపుతున్న వీరు, తమకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.



















