
రైతులకు యూరియా ఎరువుల పంపిణీలో పారదర్శకత, సౌలభ్యం పెంచేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన మొబైల్ యాప్ విధానాన్ని సద్వినియోగం చేసుకోవాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ రైతులకు సూచించారు. మంగళవారం పోతాయిపల్లి గ్రామంలో జరిగిన యూరియా పంపిణీ కార్యక్రమంలో ఆయన ఈ సూచన చేశారు.


















