
ఉత్తరప్రదేశ్ను ప్రకృతి విపత్తు వణికించింది. ఈదురుగాలులు, భారీ వడగళ్ల వర్షం కారణంగా ఒక్కరోజులోనే 89 మంది మృతి చెందగా, 53 మంది గాయపడ్డారు. అనేక ఇళ్లు ధ్వంసమయ్యాయి, పశువులు సైతం ప్రాణాలు కోల్పోయాయి. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు.



















