
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా, జూన్ 2న కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో ప్రతిష్టాత్మక 'ఇందిరమ్మ ఇండ్ల' రెండో విడత కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమం ద్వారా అర్హులైన పేదల సొంత ఇంటి కలను నెరవేర్చడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోంది.



















